టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యా యి. టీటీడీలో పనిచేస్తున్న శ్రీ బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్), శ్రీమతి ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, శ్రీమతి ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసింది. ఈ నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వీరి పైన వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావ ళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులు గా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలో టీటీడీ విజి లెన్స్ విభాగం సమర్పించిన నివేదికను..ఇతర ఆధారాలను పరిశీలించిన తరువాత నిబంధనల మేరకు వారి పైన శాఖ పరమైన చర్యలు తీసుకోవటంతో పాటుగా ఆ నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేస్తూ టీటీడీ నిర్ణయ తీసుకుంది.