Hot Posts

6/recent/ticker-posts

భారత్ చేతిలో చైనా పిలక... మాకూ ఇవ్వమంటున్న 7 దేశాలు!


INDIA NEWS: ఈ ఆపరేషన్ సందర్భంగా జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్థాన్ ఏ పరిస్థితుల్లోనూ పైచేయి సాధించలేకపోయింది. ప్రధాని మోడీ చెప్పినట్లు ప్రతీ రౌండ్ లోనూ భారత్ గెలిచింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రశిబిరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సిందూరు పేరుతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ సైనిక శిబిరాలపైనా భారత్ దాడి చేసింది. ఫలితంగా అటు ఉగ్రవాదులకు, ఇటు వారిని పెంచి పోషితోన్న పాకిస్థాన్ కు ఊహించని దెబ్బ కొట్టింది. 


ఆ విధంగా ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. అయితే.. ఈ ఆపరేషన్ సందర్భంగా జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్థాన్ ఏ పరిస్థితుల్లోనూ పైచేయి సాధించలేకపోయింది. ప్రధాని మోడీ చెప్పినట్లు ప్రతీ రౌండ్ లోనూ భారత్ గెలిచింది. ఆ సమయంలో చైనా నుంచి తెచ్చుకున్న పీఎల్-15ఈ క్షిపణికి పాకిస్థాన్ జే-10సి, జే-ఎఫ్17 జెట్స్ ద్వారా భారత్ పైకి ప్రయోగించింది. 

అయితే భారత్ తన దుర్భేధ్యమైన గగనతల రక్షణ వ్యవస్థతో వాటిని విజయవంతంగా కూల్చేసింది. ఈ క్రమంలో వీటికి సంబంధించిన ఓ క్షిపణి పంజాబ్లోని హోషియార్ పూర్ జిల్లాలో గల కమాహీ దేవి గ్రామం సమీపంలో పడిపోయాయి. వాటిని సైన్యం తీసుకుంది. ఈ సందర్భంగా చైనా పిలక భారత్ చేతికి చిక్కిందనే చర్చ మొదలైంది! ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పైకి చైనా నుంచి తెచ్చుకున్న క్షిపణిని ప్రయోగించింది పాక్. ఈ క్రమంలో ఈ పీఎల్-15ఈ క్షిపణి శిథిలాలు భారత సైన్యానికి లభించాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... ఈ క్షిపణి శిథిలాలను పరిశీలించిన నిపుణులకు పలు కీలక విషయాలు తెలిశాయని అంటున్నారు. 
 
ఈ క్షిపణిలోని ముఖ్యభాగాలు, దాని ప్రొవల్షన్, ఇనర్షియల్ యూనిట్, డేటా లింక్, అడ్వాన్స్డ్ యక్టివ్ ఎలక్ట్రానికి స్కాన్ అండ్ అర్రే స్పీకర్ సహా పలు భాగాలు చెక్కుచెదరకుండా లభించాయని అంటున్నారు. ప్రస్తుతం వాటిని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. దీంతో.. చైనా మేడ్ క్షిపణి శిథిలాలు పలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయని అంటున్నారు. ఈ సమయంలో భారత్ తో పాటు మరో ఏడు దేశాలు కూడా ఈ క్షిపణికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని అంటున్నారు. 

ఇందులో భాగంగా... అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తో పాటు జపాన్, దక్షిణ కొరియా కూడా ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయంలో తమ నిపుణులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. చైనా క్షిపణుల శిధిలాలు భారత్ కి దొరకడంపై చైనా ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. భారత రక్షణ శాస్త్రవేత్తలు వీటిని అధ్యయనం చేస్తుండటంపై ఆందోళన చెందుతుందని అంటున్నారు. ఈ సమయంలో.. పీఎల్-15ఈ క్షిపణిని రివర్స్ ఇంజినీరింగ్ చేసే అవకాశం ఉందనే టెన్షన్ ఇప్పుడు డ్రాగన్ కు విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు.