Hot Posts

6/recent/ticker-posts

దివాళా దిశగా చంద్రబాబు మానస పత్రిక ఏపీ ఫైబర్ నెట్వర్క్.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఆపరేటర్లు


ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ ఫైబర్ నెట్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివాళా దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పునఃవైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని కొండంత ఆశతో ఆపరేటర్ల ఎదురు చూస్తున్న వారికి నిరాశ కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో కనెక్షన్లు తగ్గి, ఖర్చులు పెరిగి దివాళా అంచుకు చేరుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఫైబర్ నెట్ ను సంస్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాపించిన ఆయన మానస పుత్రిక ఏపీ ఫైబర్ నెట్వర్క్. గత ప్రభుత్వంలో కనెక్షన్లు తగ్గి, ఖర్చులు పెరిగి దివాళా అంచుకు చేరుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఫైబర్ నెట్ ను సంస్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని పుకార్లు షికార్లు అవుతున్నాయి..

చంద్రబాబు 3.0 సర్కారులో ప్రజలకు చౌక ధరకు ఫోన్, ఇంటర్ నెట్, టీవీ సదుపాయాలు కల్పించాలని ఏపీ ఫైబర్ నెట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయతే గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని భావించిన ప్రస్తుత ప్రభుత్వం సంస్థను సంస్కరించాలని నిర్ణయించుకుందని సమాచారం. వచ్చే నాలుగేళ్లలో కనెక్షన్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి తీవ్ర చర్చకు కారణమైన ఏపీ ఫైబర్ నెట్ ను మళ్లీ పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని చెబుతున్నారు. వచ్చే నాలుగేళ్లలో 50 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేసేలా టార్గెట్ పెట్టుకున్న ఫైబర్ నెట్ యాజమాన్యం నెట్ వర్కు లైన్ల నిర్వహణకు ఈపీసీ విధానంలో టెండర్లు ఆహ్వానించింది. దీనికి సుమారు రూ.1900 కోట్లు ఖర్చుకానుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఆ మేరకు నిధుల కోసం రూ.1900 కోట్లతో ప్రతిపాదనలు చేస్తోంది. ఈ మొత్తాన్ని కేంద్రం నుంచి సమకూర్చుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చించారని చెబుతున్నారు. ఇప్పటికే నిధుల వేట కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలను కలవడంతో వారు సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే వినియోగదారులకు సర్విస్ సరిగా అందక వారు వేరే నెట్వర్క్ లను ఆశ్రాయిస్తున్నారు. దినితో గణనీయంగా కనెక్షన్లు తగ్గిపోయి దివాళా దిశగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం సిబ్బంది కొరత ఏర్పడి కనెక్షన్లు కంప్లైంట్లు చూసే నాధుడు లేక అధ్వాన్నంగా తయారైంది. వినియోగదారులు, ఆపరేటర్ల కాల్ సెంటర్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించితే కాల్ సెంటర్ లో ఫోన్ ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆపరేటర్లు, వినియోగదారులు ఉన్నారు. విజయవాడ కార్యాలయానికి వెళ్ళితే అక్కడ ఒకరు కనిపించడం లేదు. 

గత ప్రభుత్వంలో సంస్థను అన్నివిధాలుగా నిర్వీర్యం చేయడంతో కనెక్షన్ల సంఖ్య 9 లక్షల నుంచి నాలుగున్నర లక్షలకు పడిపోయిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కి తొంభైశాతం కనెక్లషన్లు పెరిగేలా పథకం రూపొందించాలని ఆపరేటర్లు ఎదురు చూస్తున్నారు. భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్కు లిమిటెడ్ (బీబీఎన్ఎల్)రెండు దశల్లో కలిపి సుమారు 81 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సంస్థ పరిధిలో ఉంది. ప్రస్తుతం వాటి నిర్వహణను సంస్థ స్వయంగా పరిష్కరిస్తోంది. ఇదే సమయంలో బయట ఉన్న లైన్ల నిర్వహణ, వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపడం భారంగా ఉంటోందని అంటున్నారు. ఈ దృష్ట్యా గ్రామాల వరకు ఉన్న ప్రధాన అప్టికల్ కేబుల్ నిర్వహణను ఈపీసీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.
 
మరోవైపు సంస్థను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాడేసిన డబ్బులను తిరిగి సర్దుబాటు చేయించాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో రూ.450 కోట్లు ఫైబర్ నెట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం కేటాయించాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని కొందరు నూట వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్పొరేషన్ ను ప్రక్షాళించాలనే ప్లాన్ లో భాగంగా సుమారు 908 మంది సిబ్బందిని అధికారులు తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇలా అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయానికి కేబుల్ ఆపరేటర్లు సందిగ్ధంలో పడిపోయారు. సకాలంలో సర్వీస్ అందగా ఆపరేటర్లు వినియోగదారులకు సమాధానం చెప్పలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు.

ఈ పరిస్థితుల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే సరిచేయడం కుదరడం లేదని అంటున్నారు. సిబ్బంది తొలగింపుతో చాలా రోజుల నుంచి ప్రసారాల్లో సాంకేతిక లోపం తలెత్తుతుండటం వల్ల గత రెండు వారాల్లో 25 వేల మంది వినియోగదారులు ఫైబర్ నెట్ ను తీసివేసినట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థపైనే ఆధారపడిన 6500 కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యే అవకాశం ఉందంటున్నారు. ఒకప్పుడు ఈ నెట్వర్క్ మొదలెట్టినప్పుడు రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లను బలవంతంగా జిల్లా కలెక్టర్ చేత సమావేశాలు ఏర్పాటు చేసి బలవంతపు చర్యలు తో మాచేత వ్యాపారాలు చేయించారని ఇప్పుడు ఆదే అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మా పరిస్థితి ఏంటని ఆపరేటర్లు వాపోతున్నారు. 

ఇప్పటివరకు అప్పు సప్పు చేసి నష్టాల్లో నడుపుకుంటూ వచ్చిన, చివరికి ఈ వ్యాపారం నిలబడదు అనే విషయాన్ని జీవించుకోలేక పోతున్నామని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ గోడును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ కల్పించుకుని ఏపీ ఫైబర్ నెట్వర్క్ ను నిలబెట్టాలని దాని నమ్ముకున్న కుటుంబాలకు భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రైవేట్ నెట్వర్క్ లు గుంటకాడ నక్కలాగా ఏపీ ఫైబర్ నెట్వర్క్ ను అదో పాతాళానికి త్రొక్కటానికి ఎత్తుగడలు కూడా జరుగుతున్నాయని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని అనుకుంటున్నా ఏపీ ఫైబర్ నెట్వర్కు పూర్తిగా దివాళి తీసిందని నూటికి నూరుపాళ్ళు చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు దీనిపై ముఖ్యమంత్రి గానీ ఉపముఖ్యమంత్రి గాని ఏటువంటి ప్రకటనలు చేయకపోవడం నిశ్శబ్దతగా ఉండటం పలు అనుమానాలకు కారణం అవుతుందని ఆపరేటర్ల భావిస్తున్నారు.