ANDRAPRADESH: ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా మంది ఫైటర్ గా ఉండేవారు. అందుకే జగన్ ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. వైసీపీలో ఒకనాడు భార్యాభర్తలుగా ఇద్దరూ రాజకీయం చేసిన నియోజకవర్గంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఉంది. రాజకీయంగా ఇద్దరూ సీనియర్లే. ఇద్దరూ అనుభవం కలిగిన వారే. వారే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆయన ఒకనాడు సతీమణి దువ్వాడ వాణి.
దువ్వాడ వాణి విషయానికి వస్తే ఆమె 2004లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె రాజకీయ కుటుంబానికి చెందిన వారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ నుంచే ఎదిగారు. జెడ్పీటీసీ గా గెలిచి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఆ తరువాత ప్రజారాజ్యం అక్కడ నుంచి వైసీపీలో చేరి గత నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతున్నారు. మధ్యలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా కూడా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు.
ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా మంది ఫైటర్ గా ఉండేవారు. అందుకే జగన్ ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. ఓటములు ఎదురైనా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభలోకి తెచ్చారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని వివాదాలలో చిక్కుకోవడంతో పాటు విపక్షాలకు ఆ విషయంలో టార్గెట్ కావడం పార్టీకి అది తలనొప్పిగా మారడంతో ఆయనను కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అయితే జగనే తనకు దేవుడని చెబుతూ దువ్వాడ కూడా హుందాగానే రెస్పాండ్ అయ్యారు. ఇదిలా ఉంటే దువ్వాడకు ఒకనాడు భార్య అయిన టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఆయనతో వ్యక్తిగత పోరాటం చేస్తూ వచ్చారు. తన భార్యకు విడాకులు ఇచ్చేస్తున్నానని ఒక దశలో దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు మరి ఆ విషయం పెండింగులో ఉందో ఏమో తెలియదు కానీ అధికారికంగా దువ్వాడ శ్రీనివాస్ కి వాణికి మధ్య బంధాలు కట్ అయ్యాయని ప్రచారంలో ఉంది.
ఇక చూస్తే కనుక వైసీపీలో కీలక నాయకురాలిగా ఆ మధ్యన టెక్కలి వైసీపీ ఇంచార్జి గా కూడా పనిచేసిన దువ్వాడ వాణికి పార్టీలో సముచితమైన గౌరవం దక్కుతోంది. ఆమె పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆమె వైసీపీ మనిషిగానే ఉంటున్నారు. ఆమె వైసీపీ తరఫున టెక్కలిలో క్రియాశీలకంగానే ఉన్నారు. అవకాశం అదృష్టం కలిసి వస్తే ఎమ్మెయేగా పోటీ చేయాలని కూడా ఆమె చూస్తున్నారు అని అంటున్నారు. ఇక తాజాగా వైసీపీ టెక్కలి నియోజకవర్గం స్థాయి సమావేశంలో వాణి కనిపించారు.
పార్టీ వేదిక మీద పెద్దలతో ఆమె కూడా ఉన్నారు. దాంతో ఆమె పార్టీలో కొనసాగుతున్నారని అందుకు పార్టీ పెద్దల ప్రోత్సహం కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతారనుకున్న దువ్వాడ శ్రీనివాస్ తన వ్యక్తిగత వివాదాల వల్ల వైసీపీ నుంచి అవుట్ అయ్యారు. దువ్వాడ వాణి మాత్రం కొనసాగుతూనే ఉన్నారు అని అంటున్నారు. మరి వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ బంధం భవిష్యత్తులో అయినా ఉంటుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలని అంటున్నారు.