ANDRAPRADESH: నాలుగు రోజుల క్రితం సాక్షి చానల్లో కేఎస్ఆర్ డిబేట్లో అమరావతి రైతుల్ని కించపరిచారనే ఫిర్యాదు మేరకు ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్రావును అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. కొమ్మినేని నేతృత్వంలో నిర్వహించిన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి మహిళలపై అభ్యంతర కామెంట్స్ చేయడం తీవ్ర రాజకీయ వివాదమైంది.
అమరావతి మహిళలు తుళ్లూరు పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు కొమ్మినేనితో పాటు కృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు. కృష్ణంరాజు కామెంట్స్ను కొమ్మినేని సమర్థించేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అదే కొమ్మినేని అరెస్ట్కు దారి తీసింది. ఇద్దరిపై నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం, వెంటనే ప్రభుత్వం అరెస్ట్కు వెళ్లడం గమనార్హం.
అమరావతి మహిళలపై నోరు జారిన జర్నలిస్ట్ కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉన్నట్టు సమాచారం. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే కేసులో సాక్షి చానల్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని టీడీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహింజేస్తోంది. మరోవైపు ఇద్దరు జర్నలిస్టులు క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం అరెస్ట్ చేసి, జైలుకు పంపాలని పట్టుదలతో వుంది. ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్రావును అరెస్ట్ చేయడం ఊహించని పరిణామం.