డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం: రావులపాలెంలో శుక్రవారం జరిగిన శ్రీ మారుతి ఆనియన్స్ వారి నూతన గృహ ప్రవేశము, వ్యాపార ప్రారంభోత్సం సందర్భంగా వారి ఆహ్వానం మేరకు వెళ్ళిన ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావుకి కూనా నాగబాబు దుశ్శాలువా కప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఇచ్చి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చల్లా మాట్లాడుతూ వ్యాపార రంగంలో లాభాపేక్ష కంటే కష్టమర్ల సంతృప్తే ముఖ్యమన్న సిద్ధాంతాన్ని అలవరుచుకుని ముందుకు సాగుతున్న శ్రీ మారుతి ఆనియన్స్ వారి వ్యాపార సామ్రాజ్యం దినదినాభివృద్ధి చెందుతూ వ్యాపారం మరింత విస్తరించాలని, వారికి అపారమైన లాభాలు రావాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె, జనసేన పార్టీ నాయకురాలు బార్లపూడి క్రాంతి దంపతులు, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, విక్టరీ వెంకటరెడ్డి, గొలుగూరి సోమిరెడ్ది, సలాది రామకష్ణ, నందం సత్యనారాయణ, కూనా సూర్యప్రకాష్, పెనుమత్స వెంకటేశ్వర్రావు(బాబు), డాక్టర్ చల్లా తనయుడు సుధీర్ కుమార్, ఎలుగుబంటి సాయిబాబా, ఎలుగుబంటి బూరయ్య తదితరులు పాల్గొన్నారు.