ప్రత్యేక ప్రార్ధనలో పెద్ద ఎత్తున పాల్గొన ముస్లిం సోదరులు
ఏలూరు జిల్లా: టీ నర్సాపురంలో శనివారం నాడు ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఇబ్రహీం అసమాన త్యాగానికి, శాంతి సామరస్యానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగ విశిష్టతను ఖూర్బానీ యొక్క ప్రత్యేకతను మసీదు మత ప్రబోధకులు ముంతాజ్ అన్సారీ, ఆఫీస్ నదీమ్ తెలుగు, ఉర్దూ భాషలలో ముస్లిం సోదరులకు వివరించారు.
ప్రత్యేక ప్రార్థనలు అనంతరం చాకిరేవు చెరువులోని ఖబరస్థాన్ వద్ద అమరులను స్మరించుకున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు అత్తరు సెంటు ఘమాయింపులతో ఇష్టమైన వంటకాలతో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. పేదలకు ఖూర్బానీ పంపిణీ చేశారు. పరస్పరం అలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థన నేపథ్యంలో ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మసీదు కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు, ఎస్సై విజయబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు. బక్రీద్ సందర్భంగా టి నరసాపురం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు షేక్ అబ్బాస్, షేక్ షరీఫ్, మస్తాన్, షేక్ అబూబకర్, షేక్ లాలు, సయ్యద్ మీర్ సాహెబ్ (గులాబీ), ఖాదర్, సయీద్, షేక్ కరీముల్లా, ఉస్మాన్ సాహెబ్, నవాబ్, షమ్మీకపూర్, షేక్ వజీర్, షేక్ యాసిన్, సయ్యద్ అమానుల్లా, సయ్యద్ అబ్దుల్లా, ఇషా వలి, షేక్ రహీం, ఉమర్, అమీర్ జానీ, బాబి, మౌలానా, బహుదూర్, బ్యాటరీ షరీఫ్, మీరావలి, నిజాం, మొహమ్మద్ అలీ, రషీద్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.