Hot Posts

6/recent/ticker-posts

సిసిఆర్ సి కార్డుల లక్ష్యాన్ని సాధిస్తాం: ఏలూరు జిల్లా కలెక్టర్..


అన్నదాత సుఖీభవ పదకం కింద 4,03,093 రికార్డులు పరిశీలన 
లక్ష్యంకాగా ఇంతవరకు 3,60,731 రైతుల వివరాలు పరిశీలన..
వ్యవసాయశాఖ, రెవిన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల వీడియో కాన్ఫరెన్స్ 


ఏలూరు: జిల్లాలో పంట సాగుదారు హక్కుల పత్రం(సిసిఆర్ సి), అన్నదాత సుఖీభవ పధకాల నిర్ధేశించిన లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో సాధిస్తూ జిల్లాని ముందుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.

సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి బి. రాజశేఖర్, రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో వెబ్ ఎక్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా సిసిఆర్ సి కార్డులు, అన్నదాత సుఖీభవ పధకాలపై సమీక్షించారు.  ఈ పధకాల నిర్ధేశించిన లక్ష్యాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  రైతుల గుర్తింపు, నమోదులో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించుకుని నిర్ధేశించిన లక్ష్యాలు సాధించేందుకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. 

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో 75 వేల సిసిఆర్ సి కార్డులు మంజూరు లక్ష్యంగా నిర్ధేశించారన్నారు. వాటిని నిర్దేశించిన సమయంలో లక్ష్యాలను పూర్తి చేస్తామన్నారు. అన్నదాత సుఖీభవ పదకం కింద 4,03,093 రికార్డులు పరిశీలన లక్ష్యంకాగా ఇంతవరకు 3,60,731 రైతుల వివరాలు పరిశీలన పూర్తయిందన్నారు. లక్ష్యసాధనకు సంబంధిత శాఖలకు దిశా నిర్దేశం చేస్తూ సమన్వయంతో లక్ష్యాలు సాధిస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సమావేశంలో  జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, తదితరులు పాల్గొన్నారు.