ఏలూరు:
అక్రమ తవ్వకాలు కాదు.. పక్షుల ఆవాస కేంద్రాన్ని సుందరీకరణ చేసేందుకు జెసిబిలతో పనులు చేస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం పక్షుల ఆవాస కేంద్రాలు జంతువు ఆవాస కేంద్రాల వద్ద యంత్రాలతో పనులు చేయకూడదు. కానీ అక్కడ యంత్రాలతో పనులు జరుగుతున్నాయని ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు అంతే..
కొల్లేరు లోని మాధవపురం పక్షుల కేంద్రంలో గట్లు బలోపేతం చేయటానికి రూ- అర్బన్ ద్వారా నిధులు మంజూరు..
ఫారెస్ట్ నిబంధనల మేరకు పనుల ప్రతిపాదన..
వర్షాల నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని యోచన
ఫారెస్ట్ అనుమతుల పెండింగ్ నేపథ్యంలో అనుమతుల కోసం నిరీక్షణ..
మరో వైపు ముంచుకొస్తున నైరుతి రుతుపవనాలు..
గత 6ఏళ్లుగా నిధులు ఉన్నా అభివృద్ధి చెందని మాధవాపురం పక్షుల ఆవాస కేంద్రం...
పక్షుల ఆవాస కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం గా పనుల ప్రతిపాదన తప్ప కొల్లేరులో ఎక్కడా కూడా ఒక గజం అక్రమ త్రవ్వకాలు జరగట్లేదు అని, ఎవరైనా జరిపినా కూటమి ప్రభుత్వం సహించబోధని గతంలోనే స్పష్టం చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్...