- ఎన్నికల్లో హామీ మేరకు వేట నిషేధ సమయంలో రూ. 20,000 సాయం విడుదల...
- 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.259 కోట్ల లబ్ధి..
- మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
- ఏలూరు జిల్లాలో లబ్ధి పొందుతున్న కొల్లేరు ప్రాంతంలో పలువురు మత్స్యకారులు
- రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి
నూజివీడు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థికసాయంను రెట్టింపు చేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర నిర్మాణ సమాచార పోర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోనే 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ. 259 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. మత్స్యకార గ్రామాలకు గ్రామాలు టీడీపీకి అండగా నిలబడ్డాయని, వెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం ధ్యేయమన్నారు.
సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచామన్నారు. ప్రజలందరికీ సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టినా, . ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా శతమానం అందలేదన్నారు.
2014లో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు భృతిని ప్రవేశ పెట్టిందని, 2014-2019 మధ్య మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, అంతేకాకుండా వలలు, పడవలు, ఐస్ బాక్సులు అదనంగా ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నామన్నారు.
మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లిస్తున్నామని, వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నామన్నారు. కొల్లేరు మండలాల్లోని కేవలం చేపల వేట పై జీవనం సాగించే ఎంతోమంది మత్స్యకారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు.
చేపల ఎగుమతుల్లో ఏపీ టాప్ రాష్ట్రంలో 555 మత్స్యకార గ్రామాలున్నాయని, . చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందువరుసలో ఉందన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్యసంపదలో 29 శాతం మన రాష్ట్రం నుంచే ఉంటోందన్నారు.
ఏపీ నుంచే 32 శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయని, . మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. . చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయ్యని, . వీటి ద్వారా ప్రోటీన్ అధికంగా శరీరానికి అందుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు వినియోగం పెరగాలని మంత్రి పార్థసారథి చెప్పారు.