ANDRAPRADESH: ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడును వెన్నుపోటుదారుడని, అవినీతిపరుడని తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తాజాగా నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ శరణి రచించిన "మైండ్సెట్ షిఫ్ట్" పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్కు గురవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు, ఇప్పుడు ఆయనను ప్రశంసించడంపై నెటిజన్లు "మైండ్సెట్ షిఫ్ట్" అంటూ కొద్దిరోజులుగా ట్రోల్ చేస్తున్నారు.
ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో చంద్రబాబు నాయుడును వెన్నుపోటుదారుడని, అవినీతిపరుడని తీవ్రంగా విమర్శించారు. తన పార్టీ స్థాపనకు అవే కారణాలని కూడా పేర్కొన్నారు. అయితే తాజాగా జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడును చిరంజీవి ఆకాశానికెత్తడంపై పాత వీడియోలను, ప్రకటనలను బయటకు తీస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతానికి, ఇప్పటికి చిరంజీవి మాటల్లో ఇంత వ్యత్యాసం ఉండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పాటు ముఖ్యమంత్రి సమక్షంలో చిరంజీవి నారాయణ విద్యాసంస్థలను ప్రశంసించడం కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థను పొగడటం సరైంది కాదని, ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రోత్సహించాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగం అనవసరమైన విషయాల గురించి మాట్లాడిందని, ఇది ఆయన గౌరవాన్ని తగ్గించిందని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఒక రకంగా మాట్లాడి, ఇప్పుడు మరో రకంగా మాట్లాడటం, వివాదాలున్న ప్రైవేట్ సంస్థను ప్రశంసించడం వంటి కారణాలతో చిరంజీవి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్గా మారారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా ఆయన పరోక్షంగా రాజకీయాలు చేస్తున్నారని కూడా కొందరు విమర్శిస్తున్నారు.
NEW..
..
గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, ప్రధాని మోడీలపై చిరంజీవి గొప్ప మాటలు#chandrababu
— Anitha Reddy (@Anithareddyatp) April 21, 2024
#ప్యాకేజీ
#chiranjeevi pic.twitter.com/djmoqjz17e