Hot Posts

6/recent/ticker-posts

'రూ.15 వేల డ్రోన్లు కూల్చడానికి రూ.15 లక్షల క్షిపణులా?'


INDIA NEWS: స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివా.. ఘర్షణ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు.. చైనా తయారు చేసినవి. By:  PASCHIMA VAHINI  ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మరణించారు. ఈ ఘటనపై ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అపరేషన్ సిందూర్ చేపట్టింది. 


ఈ ఆపరేషన్ అనంతరం పాక్.. భారత్ పై దాడికి పాల్పడింది. ఈ సమయంలో జరిగిన ఓ విషయంపై కాంగ్రెస్ తాజాగా స్పందించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ పలు డ్రోన్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అవి వేల సంఖ్యలో ఉంటాయని అంటున్నారు. అయితే.. వాటన్నింటినీ భారత గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఈ సమయంలో పాక్ చీప్ డ్రోన్లను కూల్చడానికి భారత్ ఖరీదైన క్షిపణులను ప్రయోగించిందంటూ కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివా.. ఘర్షణ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు.. చైనా తయారు చేసినవి. వాటి ధర ఒక్కొక్కటీ రూ.15వేలు మాత్రమే. అయితే.. వాటిని నేలకూల్చేందుకు కేంద్రం మాత్రం రూ.15లక్షల విలువైన క్షిపణులను ఎందుకు వినియోగించిందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో... ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మనకు జరిగిన నష్టం గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అన్నారు. 

నాగపూర్ లో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... ఘర్షణలో జరిగిన నష్టాలను గురించి ప్రభుత్వాన్ని అడగటం తప్పా అని ప్రశ్నించారు. దీంతో... ఈ విషయాలపై సమాధనం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు! మరోపక్క ఇదే విషయంలో రాహుల్ గాంధీ పలుమార్లు మాట్లాడారు. ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో తెలపాలని కోరుతూ.. దీనిపై మౌనం వహించడం తగదని అన్నారు. ఇదే సమయంలో.. ఈ ఆపరేషన్ గురించి పాకిస్థాన్ కు తాము ముందే సమాచారం ఇచ్చామని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు.