Hot Posts

6/recent/ticker-posts

శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో 61వ ఉగాది జాతర మహోత్సవాలు 25న మొదలు


ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం: పట్టణానికి ఉత్తరాన కొలువైయున్న ఆధ్యాత్మిక అమ్మవారి ధామం శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో 61వ ఉగాది జాతర మహోత్సవాలు ఈ నెల 25న మంగళవారం మొదలు అవుతున్నాయని డాక్టర్ రాజాన సత్యనారాయణ అన్నారు.

డాక్టర్ రాజాన మాట్లాడుతూ మార్చి 25వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ జాతర మహోత్సవాలు 25వ తేదీ ఉదయం 8 గంటలకు గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి సుమారు వెయ్యి మంది మహిళలలు కలశాలను చేతబూని శోభాయాత్ర నిర్వహించడంతో ప్రారంభమవుతాయని తెలిపారు.

ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) తో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాలలో మహిళలు పాల పొంగళ్ళు, సప్త నదీ జలాలతో ప్రతి ఒక్కరు పాల్గొని తరించాలని కోరారు. అమ్మ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ ఉగాది జాతర మహోత్సవాలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అర్చక స్వాములు నిత్య పూజా కైంకర్యాలు, అభిషేకాలు మరియు సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు, గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ప్రసాదం వితరణ జరిగిందని డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు.