Hot Posts

6/recent/ticker-posts

వాలీబాల్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు



అశ్వారావుపేట/దమ్మపేట: దిబ్బగూడెంలో నిర్వహిస్తున్న దిబ్బగూడెం గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు హాజరై టోర్నమెంట్ నీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ టోర్నమెంట్ నిర్వహించుకోవాలని, క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించి క్రీడాకారుల మధ్య స్నేహ బంధాన్ని పెంపొందిస్తుంది అన్నారు. 

ఈ కార్యక్రమంలో వారి వెంట నియోజకవర్గ నాయకులు ద్వారా యుగంధర్, అంకత ఉమా మహేశ్వరరావు, మాజీ సర్పంచ్ కునుసొత్తు చిట్టి బాబు, మహిళా నాయకురాలు యట్ల వెంకమ్మ, నలుపు నాగేంద్ర, కె బాలాజీ తదితరులు ఉన్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now