తాజా వార్తలు

10/recent/ticker-posts

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ‎


 ఏలూరు/ఢిల్లీ, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 13: దేశవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తిగా కట్టుబడి ఉందన్నారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి ప్రతాప్రవో జాదవ్. దేశంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల తయారీ, అమ్మకం మరియు వినియోగాన్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల వివరాలు కోరుతూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 

ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006  అమలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి బాధ్యతగా పేర్కొన్న మంత్రి జాదవ్, ఈ సమస్యను పరిష్కరించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 'ఆజ్ సే థోడా కమ్' అనే అవగాహన చర్యను చేపట్టినట్లు వెల్లడించారు. దేశం అంతటా ఆహార భద్రత స్పృహ మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాలో 'ఈట్ రైట్ ఇండియా' ఉద్యమం కింద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా "హర్ లేబుల్ కుచ్ కెహ్తా హై" అనే అవగాహన ప్రచారాన్ని కూడా చేపట్టిందన్నారు. 

ఈ అవగాహన ప్రచారం ఆహార లేబుళ్లపై వారి అవగాహనను పెంచడం ద్వారా సమాచారంతో కూడిన ఆహార ఎంపికలు చేసుకునేలా వినియోగదారులను శక్తివంతం చేయడంపై దృష్టి పెడుతుంది. ఆహార లేబుళ్లలో ఉత్పత్తి యొక్క పోషక విలువలు, పదార్థాలు వాటితో సంభవించే అలెర్జీ కారకాల గురించి కూడా లేబుళ్లలో కీలకమైన సమాచారం ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార భద్రత మరియు ప్రమాణాలలో భాగంగా "పాఠశాలలో పిల్లలకు సురక్షితమైన ఆహారం మరియు సమతుల్య ఆహారాల నిబంధనలు- 2020" ను తీసుకొచ్చినట్లు కేంద్ర ఆహార మంత్రి ప్రతాప్రవో జాదవ్ తెలిపారు. 

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల పోషక మరియు ఆరోగ్య ప్రభావాల గురించి వినియోగదారులకు తెలియచేయటంతోపాటు, నిరంతర తనిఖీలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఎఫ్ ఎస్ ఎస్ చట్టం, 2006 కింద నిర్దేశించిన నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేదో తనిఖీ చేయడానికి సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా విభాగాల అధికారులు ఏడాది పొడవునా వివిధ ఆహార ఉత్పత్తులపై క్రమం తప్పకుండా నిఘా, పర్యవేక్షణ, తనిఖీ  నమూనాల సేకరణ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.