బుట్టాయిగూడెం, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి, 22: రెడ్డి గణపవరం గ్రామానికి చెందిన అల్లూరి రత్నాజీ కుమార్తె ఓనిల వేడుక ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజా రాణి కళ్యాణ మండపంలో సాంప్రదాయ వాతావరణంలో జరిగింది.
ఈ శుభకార్యక్రమానికి చిర్రి బాలరాజు హాజరై చిన్నారికి ఆశీస్సులు అందజేశారు. కుటుంబ సభ్యులను అభినందిస్తూ, బాలిక ఆరోగ్యంగా, విద్యావంతురాలిగా ఎదిగి కుటుంబానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు చెరుకూరి శ్రీధర్, గురజాలా వెంకటేశ్వరరావు, గద్దే విజయ్, మట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓనిల వేడుక సాంప్రదాయ ఆచారాలతో, ఆత్మీయ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఆనందంగా జరిగింది.







