ANDRAPRADESH, GUNTURU, TENALI: కూటమి సర్కార్కు జీర్ణించుకోని కఠోర నిజం. వైఎస్ జగన్కు జనంలో క్రేజ్ పెరుగుతోంది. తెనాలి పర్యటనలో జగన్పై జనాదరణే నిదర్శనం. జగన్ తెనాలి పర్యటనపై విమర్శలు ఏవైనా వుండొచ్చు. కానీ ఆయన రాక కోసం వేలాదిగా ఎదురు చూడడాన్ని కూటమి కొట్టి పారేస్తే, అది దాని ఖర్మ అనుకోవాల్సిందే. ఎందుకంటే, జగన్కు క్రేజ్ పెరుగుతుందంటే, దాని అర్థం కూటమి పరపరి రోజురోజుకూ తరుగుతోందని.
తెనాలిలో జగన్కు జనం వెల్లువెత్తడం వైసీపీలో జోష్ నింపింది. ఏడాది క్రితం వరకూ జగన్ వద్దు బాబోయ్ అనుకున్న జనమే, ఇప్పుడు ముద్దు అంటున్నారంటే, భారీ తేడా కొడుతోందని ఆయన ప్రత్యర్థులు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. పరిపాలనే అంతిమంగా రాజకీయ పార్టీల భవిష్యత్ను తేల్చుతుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్, ఈ ఏడాది కాలంలో జనానికి దగ్గరైంది చాలా తక్కువ.
అధికారంలో ఉన్నప్పుడే తమకు దూరంగా ఉన్నారనే కోపమే, వైసీపీని ఓడించేలా చేసింది. కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తామని, ఆ తర్వాత హామీల అమలు చేయకపోతే నిలదీస్తామని అప్పట్లో జగన్ హెచ్చరించారు. ఈ ఏడాది కాలంలో కూటమి సర్కార్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలే, జగన్పై ప్రజల నమ్మకాన్ని పెంచాయి. ఇది కూటమికి ప్రమాద సంకేతం. తెనాలికి జగన్ వెళితే, వైసీపీ కార్యకర్తలు మాత్రమే వచ్చార్లే అని కూటమి నేతలు అనుకుంటే, అది వాళ్ల ఇష్టం.
కానీ క్షేత్రస్థాయిలో చంద్రబాబు పాలనపై ఏదో అసంతృప్తి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో కాలయాపన, తప్పించుకునే ధోరణి ప్రజలకు నచ్చడం లేదు. తాము మోసపోయామనే భావన వాళ్ల మనసుల్ని గుచ్చుతోంది. గతంలో జగనే మేలు అని బలమైన ఓటు బ్యాంక్ ఉన్న వాళ్లు అనుకునే పరిస్థితి. అందుకే జగన్ జనంలోకి వెళితే, బ్రహ్మరథం పట్టే పరిస్థితి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని వైసీపీ నేతలు హుషారుగా చెబుతున్నారు.