ANDRAPRADESH: రాష్ట్రంలో కూటమి పార్టీలు విజయం దక్కించుకుని ఏడాది పూర్తయింది. 2024, జూన్ 4న వచ్చిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-బీజేపీ-జనసేనలు విజయ దుందుభి మోగించాయి. అయితే.. దీనిపై అనేక అనుమానాలు.. అనేక సందేహాలు.. ముసురుకున్నాయి. భిన్న వైరుధ్యాలు ఉన్న పార్టీలు.. ఒకే ఒరలో ఇమడడం.. ప్రజల మధ్యకు రావడం.. వంటివి అప్పట్లో చర్చకు దారి తీశాయి. ఎందుకంటే కూటమి అంత ఈజీగా ఏర్పడలేదు.
అనేక ప్రయత్నాలు.. అనేక ఢిల్లీ పర్యటనల తర్వాతే.. బీజేపీ నేతలు.. టీడీపీతో జత కట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను తిట్లు కూడా తిన్నానని చెప్పారు. ఇలా కూటమి కట్టిన పార్టీలు.. ఎన్నిక లప్రచారానికి వచ్చే సరికి.. సీట్ల పంపకాల కు వచ్చే సరికి.. మాత్రం తొలి దశలో కొంత గడబిడకు గురయ్యాయి. పార్టీలకు సీట్ల పంపకాలు అయిపోయి న తర్వాత.. బీజేపీ దూకుడుగా వ్యవహరించడం.. కొంత అయోమయానికి గురి చేసింది.
అనేక ప్రయత్నాలు.. అనేక ఢిల్లీ పర్యటనల తర్వాతే.. బీజేపీ నేతలు.. టీడీపీతో జత కట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాను తిట్లు కూడా తిన్నానని చెప్పారు. ఇలా కూటమి కట్టిన పార్టీలు.. ఎన్నిక లప్రచారానికి వచ్చే సరికి.. సీట్ల పంపకాల కు వచ్చే సరికి.. మాత్రం తొలి దశలో కొంత గడబిడకు గురయ్యాయి. పార్టీలకు సీట్ల పంపకాలు అయిపోయి న తర్వాత.. బీజేపీ దూకుడుగా వ్యవహరించడం.. కొంత అయోమయానికి గురి చేసింది.
దీనికి తోడు.. అప్పటికే ప్రకటించిన టీడీపీ స్థానాల్లో మార్పులు.. చేర్పులు.. వివాదాలు వంటివి తెరమీదికి వచ్చాయి. టీడీపీనాయకులు జనసేనలోకి, బీజేపీలోకి వెళ్లి టికెట్లు తెచ్చుకోవడం కూడా.. చర్చకు దారి తీసింది. ఏతావాతా రాజకీయంగా ఒక అనిశ్చితి ఏర్పడింది. మరోవైపు.. జగన్ దూకుడు.. ప్రచారం.. వంటివి కూడా.. చర్చకు వచ్చాయి. ఇన్ని పరిణామాల మధ్య జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం దక్కించుకోవడం గమనార్హం. కేవలం 11 స్థానాలకు వైసీపీని కట్టడి చేశాయి.
ఇలా.. అసలు గెలుపు సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి గెలిచి నిలిచిన కూటమికి నేటితో ఏడాది పూర్త య్యింది. 94 శాతం స్ట్రయిక్ రేట్తో విజయం దక్కించుకున్న ఏకైక కూటమిగా కూడా దేశంలో రికార్డు సృష్టించడం.. ఈ కూటమికే సాధ్యమైంది. ఇక, ఈ ఏడాది కాలంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప.. పెద్దగా కూటమి ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోవడం కూడా.. గమనార్హం. మూడు పార్టీల్లోనూ అభివృద్ధి మంత్రం వినిపిస్తుండడంతో ప్రజలకు మరింత భరోసా ఏర్పడిందనే చెప్పాలి. కాగా.. ఈ కూటమి విజయం తాలూకు.. ఫలితం జనసేనకే దక్కడం మరో విశేషం.