కృష్ణా జిల్లా, మచిలీపట్నం ప్రతినిధి: కోట్ల రూపాయలు కేటాయించి నిర్మించిన మచిలీపట్నం నూతన రైల్వే స్టేషన్ వల్ల ప్రయాణికులు యొక్క కష్టాలు మరింత పెరిగినాయి అని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకి శెట్టి బాలాజీ అన్నారు. బుధవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ మచిలీపట్నం నుండి విజయవాడకు రైల్వే డబల్ లైనింగ్ వేసిన ప్రయాణం సమయం ఏమాత్రం తగ్గడం లేదని అన్నారు.
ప్రతిరోజు విశాఖపట్నం నుండి మచిలీపట్నం వచ్చే రైలు గుడివాడ నుండి మచిలీపట్నం రావడానికి 35 మైళ్లుకి రెండు గంటల సమయం పడుతుందని అన్నారు. భీమవరం లాంటి చిన్న పట్టణంలో రెండు రైల్వే స్టేషన్ లో రెండు లిఫ్టులు ఉన్న మచిలీపట్నంలో ఒక్క లిఫ్ట్ ఏర్పాటు చేయకపోవడం వలన రైల్వే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని బాలాజీ అన్నారు.
ఉదయం ఏడు గంటలకు విజయవాడ వెళ్లే ట్రైన్ మూడో నెంబర్ ప్లాట్ఫారం పెట్టడం వల్ల ఉద్యోగస్తులు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ అన్నారు. అదేవిధంగా విశాఖపట్నం ట్రైన్ కూడా రెండు లేదా మూడు ప్లాట్ఫారాలలో పెట్టడం వల్ల లిఫ్ట్ లేకపోవడంతో రైల్వే కూలీలు లేకపోవడంతో ప్రయాణికులకు ముఖ్యంగా వృద్ధులు మహిళలు దివ్యాంగులు ఇబ్బందులు మరింత పెరిగాయని బాలాజీ అన్నారు. తక్షణమే మచిలీపట్నం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు.
ప్రతిరోజు బీదర్ నుండి మచిలీపట్నం వచ్చే బీదర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు అరగంట నుండి గంట వరకు ఆలస్యం కావడం వల్ల సికింద్రాబాద్ స్టేషన్ లో మచిలీపట్నం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ తెలియజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూర్చోవడానికి సిమెంట్ బల్లలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని బాలాజీ తెలియజేశారు.
విజయవాడ నుండి రాత్రిపూట మచిలీపట్నం వచ్చే రైలులో రైల్వే పోలీస్ బందోబస్తు పెరగాలని, ప్రయాణికులకు సెక్యూరిటీ ఇవ్వాలని బాలాజీ డిమాండ్ చేశారు.
ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ నుండి మచిలీపట్నం వచ్చే రైలుకు రెండున్నర గంటల సమయం పడుతుంది. ప్రయాణ సమయం తగ్గించినట్లయితే ప్రయాణికులు సంఖ్య పెరుగుతుంది. గుడివాడలో ఎక్కువ సమయం రైలు నిలపడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
రైల్వే స్టేషన్ లో పార్కింగ్ ఫీజు అధికంగా ఉందని రైల్వే టికెట్ కంటే పార్కింగ్ ఫీజు ఎక్కువగా కావడం వల్ల రైల్వే ప్రయానికులు ఇబ్బంది పడుతున్నారని బాలాజీ తెలియజేశారు. మచిలీపట్నంనుండి ప్రతి రెండు గంటలకు గుడ్లవల్లేరు గుడివాడ స్టాపులతో విజయవాడకు అదనపు రైళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బాలాజీ అన్నారు.
అదేవిధంగా మచిలీపట్నం తిరుపతి రైలు రెగ్యులర్ గా మచిలీపట్నం నుండి ఏర్పాటు చేయాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరీ జిల్లా ముఖ్య కేంద్రం నుండి ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రా రైల్వే శాఖతో తక్షణమే చర్చలు జరపాలని కోరారు.
మచిలీపట్నం రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఏర్పాటు కోసం గతంలో ఎంపీ ఫండ్ నుండి 50 లక్షలు ప్రకటించిన విషయాన్ని బాలాజీ సందర్భంగా గుర్తు చేశారు.
Suresh. V
Staff Reporter
Krishna District