Hot Posts

6/recent/ticker-posts

ఆడుదాం ఆంధ్ర ఏలూరు నియోజకవర్గస్దాయి పోటీలు ప్రారంభం.


 ఏలూరు: బుధవారం ఏలూరు నియోజకవర్గం స్దాయి ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. స్దానిక అల్లూరి సీతారామరాజు స్టేడియం  సీఆర్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలోని ఇండోర్‌ గ్రౌండ్‌లో బ్యాడ్మెంటెన్‌ పోటీలు జరిగాయి.  5 క్రీడా విభాగాలలో, 15 టీం లు రెండు రోజులు పాటు క్రీడా పోటీలలో పాల్గొంటాయి.  ఏలూరు నగరంలో జోనల్‌స్దాయిలో పోటీల్లో తలపడి ప్రధమస్దానంలో నిలిచిన జట్లు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. 


కబడ్డి, ఖొ ఖొ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మెంటెన్‌ క్రీడాంశంలో పురుషులు, మహిళల జట్లు పోటీపడుతున్నాయి. 10 రోజల పాటు సాగే ఈ పోటీల్లో విజయం సాదించిన ప్రదమ జట్టుకు రూ 35 వేలు, ద్వితీయస్దానం జట్టుకు 15 వేలు, తృతీయస్దానం జట్టుకు రూ 5 వేలు అందించనుంది. నియోజకవర్గస్దాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్దాయికి చేరుకుంటాయని జిల్లా క్రీడాధికారులు వెల్లడించారు.

          

ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ స్థాయి పోటీల ప్రత్యేక అధికారి జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ కె. రవికుమార్,  ఏలూరు నగర పాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకట కృష్ణ, డి ఎస్ డి ఓ శ్రీనివాసరావు, ప్రభృతులు పాల్గొన్నారు.