Hot Posts

6/recent/ticker-posts

లింగ నిర్ధారణ నియంత్రణ దుర్వినియోగం నివారణచట్టం పై అవగాహన సదస్సు


ఏలూరు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలోమంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్  సేవాధికార సంస్థ భవనం జిల్లాలోని రేడియాలజిస్టులకు, ల్యాబ్ టెక్నీషియన్ లకు, పిసి &పి ఎన్ డి టి యాక్ట్ (ముందస్తు  లింగ నిర్ధారణ  నియంత్రణ మరియు దుర్వినియోగం నివారణ చట్టం) పై అవగాహన సదస్సు నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత డాక్టర్ల అనుమతితోనే పరీక్షలు నిర్వహించాలని పరీక్ష వివరాలను బయటకు వెలువరించరాదని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వైద్య పరీక్షా కేంద్రాల పైన,  హాస్పటల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని. నేటి సమాజంలో భ్రూణ హత్యలు పెరిగినవని శిశువు ఆడ, మగ తెలుసుకుని  పితృస్వామ్య వారసత్వ చట్టాలు మరియు సాంస్కృతిక పద్ధతుల కారణంగా సాంప్రదాయకంగా ఆడపిల్లల కంటే మగ పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, మగ బిడ్డ పుట్టే వరకు కుటుంబాల పిల్లల్ని కలిగి ఉండటం కొనసాగించడానికి దారితీసింది, ఆడ శిశువులను వధించడం జరుగుతుందని క్రమంగా సమాజంలో స్త్రీల సంఖ్య తగ్గిపోతుంది  వీటిని నివారించడానికి చట్టాన్ని రూపొందించారని తెలియజేశారు. 


వైద్య పరీక్షా కేంద్రాలు ఎటువంటి  ఒత్తిడిలకు తలవంచకుండా చట్టప్రకారం నడుచుకోవాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రం నందు ఈ చట్టం యొక్క విధివిధానాల ప్రదర్శించే బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. మరియు కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల ఫారం కమిషన్ మెంబర్  కె ఎస్ నాగలక్ష్మి, డిప్యూటీ డెమో నాగరత్నం, ప్యానల్ లాయర్ జీవి భాస్కర్ జిల్లాలోని  రేడియాలజిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.