తాజా వార్తలు

10/recent/ticker-posts

చినగురవాయిగూడేం మాలపల్లిలో రామాలయం పునర్నిర్మాణానికి హామీ – గ్రామస్తులతో సమావేశమైన టీడీపీ నేత రవి కొండపల్లి


టీ. నర్సాపురం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 19: టి. నర్సాపురం మండలం చినగురవాయిగూడేం మాలపల్లిలో శిధిలావస్థకు చేరుకున్న రామాలయం పునర్నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గ్రామస్తుల సమస్యలను పరిగణలోకి తీసుకుని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవి కొండపల్లి గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయం గత కొన్నేళ్లుగా శిథిలమై ఉండటంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


2024 ఎన్నికల ప్రచార సమయంలో గ్రామస్తులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని రవి కొండపల్లి తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారంపై చర్చించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం మరియు టిటిడి ద్వారా నిధులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దళితవాడలలో ఆలయాల నిర్మాణం వల్ల భక్తి భావం పెరిగి, యువత మంచి మార్గంలో నడుస్తారని ఆయన పేర్కొన్నారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు అవసరమని చెప్పారు. గ్రామస్తుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రాముని ఆశీస్సులతో ప్రభుత్వం మరియు టిటిడి సహకారంతో త్వరలోనే నూతన రామాలయం నిర్మాణం ప్రారంభమవుతుందని గ్రామస్తులకు తెలిపారు. ఆలయం నిర్మాణం ద్వారా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆలయ నిర్మాణంపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరారు. కార్యక్రమం ద్వారా గ్రామంలో ఆశాజనక వాతావరణం నెలకొంది.