ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఎంలో ఘటన
మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థిని
తమ హాస్టల్ కు వస్తే కౌన్సెలింగ్ ఇస్తానన్న విద్యార్థి
కూల్ డ్రింకులో మత్తుమందు.. స్పృహ కోల్పోయిన విద్యార్థినిపై అత్యాచారం
నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
NATIONAL:ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-కలకత్తా (ఐఐఎం-కలకత్తా) విద్యార్థినిపై అదే విద్యాసంస్థకు చెందిన ఓ విద్యార్థి అత్యాచారం చేశాడు. బాయ్స్ హాస్టల్ లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు హరిదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయగా, దాని ఆధారంగా నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటోంది. అయితే, మానసిక సమస్యలకు కౌన్సెలింగ్ ఇస్తానని ఆ యువకుడు సదరు బాధితురాలిని తమ హాస్టల్కు ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు మత్తు కలిపిన పానీయం ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది.
స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు గుర్తించింది. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించినట్లు కూడా ఆమె ఆరోపించారు. నిందితుడైన విద్యార్థిని శుక్రవారం రాత్రే అదుపులోకి తీసుకుని, శనివారం లాంఛనంగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవలే కోల్కతాలోని ఓ లా కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

Shakir Babji Shaik
Editor | Amaravathi