మృతులు రాకేశ్ (20), మధన్ (18), భరత్(16), వినోద్ (19), హ్రితిక్ (22). ముఖ్యంగా భక్తులు అనుమతి ఉన్న స్నాన ఘాట్ లల్లో మాత్రమే స్నానం చేయాలి అంతే తప్ప నది లో ఎక్కడ పడితే అక్కడ స్నానాలు చేయకూడదు. కావున భక్తులందరూ జరుగుతున్న ప్రమాదాల్ని దృష్టి లో ఉంచుకొని జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచించారు.
బాసర నది ప్రమాదం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపిఎస్ దీనిపై సమీక్షించారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, సిఐ మల్లేష్ (ముధోల్), ఎస్సై శ్రీనివాసులతో కలిపి ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నదిలో అనుమతి ఉన్న స్నాన ఘాట్ లో మాత్రమే భక్తులు స్నానాలు చేసే లాగా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని ప్రదేశాల్లో, ప్రమాదకరం గా ఉన్న ప్రదేశాల్లో భక్తులు స్నానానికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశించారు.