జీడీఎస్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పలు డిమాండ్లను వివరించారు. కమలేష్ చంద్ర ఇచ్చిన రిపోర్టులోని సానుకూల అంశాలు అమలు పరచాలని, గ్రామీణ డాక్ సేవకుల అందరకి సివిల్ స్టేటస్ హోదా కల్పించాలని, 12, 24, 36 సంవత్సరాలకు అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు మరియు గ్రాడ్యూటీ అయిదు లక్షలు రూపాయలు పెంచాలని, 180 రోజులు వరకు సెలవులను దాచుకున్న వారికి నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని, కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు కల్పించాలని, జిడిఎస్ కాంట్రిబ్యూషన్ 10 శాతం డిపార్ట్మెంట్ కంట్రిబ్యూషన్ 10 శాతం ఇవ్వాలని, అలాగే తాత్కాలిక పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సమస్యలన్నీ అంగీకరించే వరకు జె సి ఎ పిలుపుమేరకు నిరవధికే సమ్మె చేస్తామని వారు తెలిపారు. ఆ తరువాత మెయిన్ సెంటర్ నుంచి బస్టాండ్ మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీగా హెడ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళారు.
ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఎం దుర్గా వరప్రసాద్, దర్భ గూడెం బిపిఎం పి.దుర్గారావు, టీ నర్సాపురం ఎన్.దుర్గారావు, ఏలూరు డివిజన్ పరిధిలో గల గ్రామీణ డాక్ సేవకులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు.
Repoter
T. Venkanna Babu
Jangareddy Gudem