సమస్యలు ఉంటే తెలియచేయమన్నప్పుడు వారు వ్రాత పూర్వకముగా తెలపాలన్నారు. లవెట్రిలు లేవని ఉన్నవాటిలో కొన్నింటిలో నీళ్ళు రావని మరి కొన్నింటికి తలుపులు లేవని,. తినుటకు భోజనం సరిపోవుట లేదని, చుట్టూ వున్న ప్రహరీ గోడ యెత్తు పెంచాలని జడ్జి గారిని కోరారు, తరువాత వంట గదిని, స్టోర్ రూం, స్టాక్ రిజిష్టర్ పరిశీలించారు, వంట వండే వారిని, దానికి సంబందించిన ఉపాధ్యాయులను ఉద్దేశించి పిల్లలకు అందించు ఆహారం నాణ్యతతో కుడినదిగా వుండాలని, బియ్యం, పప్పులు శుభ్రంగా కడగాలని పురుగు పట్టకుండా చూడాలని, వంటగది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలంలో పరిసరాలు మరింత శుభ్రంగా ఉంచుటకు ఎవరికి వారు తమవంతు ప్రయత్నించాలని తెలిపారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి పిల్లలకు మంచి చదువు నేర్పాలని కోరారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీ పట్నల శ్రీనివాసు, డేవిడ్ రాజు, వెంకట చైతన్య, ఏసు పాదం, ఉమర్ ఫరూఖ్, పార లీగల్ వాలంటీర్ అక్బర్ ఆలి, స్కూల్ ఇంఛార్జి ప్రిన్సిపాల్ శ్రీదివ్య మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.