Hot Posts

6/recent/ticker-posts

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి . చైర్మన్.G. మధు బాబు


ఏలూరు జిల్లా చింతలపూడి: ఆంధ్రప్రదేశ్ గురుకుల హాస్టల్, నాగిరెడ్డి గూడెం., చింతలపూడి మండలం. చింతలపూడి మండల న్యాయ సేవల కమిటీ ఛైర్మెన్ మరియు జూనియర్ సివిల్ జడ్జి C మధు బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల సంస్థ, అమరావతి వారి ఉత్తర్వులు  మరియు జిల్లా న్యాయ సేవల కమిటీ సంస్థ ఆదేశ ముల మేరకు వెల్ఫేర్ హాస్టల్స్ విసిట్ లో భాగంగా ఈ రోజు నాగిరెడ్డిగూడెంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ మరియు వసతి గృహాన్ని సందర్శించి పిల్లలకు అందుచున్న విద్య, ఆహార, వసతి సదుపాయాలు గురించి అడిగి తెలుసుకుని ఇక్కడ వున్నవారు అందరూ పేద పిల్లలని ప్రభుత్వము అందించు వనరులను అనుభవించుచూ కష్టపడి చదువుకోవాలన్నారు. 

సమస్యలు ఉంటే తెలియచేయమన్నప్పుడు వారు వ్రాత పూర్వకముగా తెలపాలన్నారు. లవెట్రిలు లేవని ఉన్నవాటిలో  కొన్నింటిలో నీళ్ళు రావని మరి కొన్నింటికి తలుపులు లేవని,. తినుటకు భోజనం సరిపోవుట లేదని, చుట్టూ వున్న ప్రహరీ గోడ యెత్తు పెంచాలని జడ్జి గారిని కోరారు, తరువాత వంట గదిని, స్టోర్ రూం, స్టాక్ రిజిష్టర్ పరిశీలించారు, వంట వండే వారిని, దానికి సంబందించిన ఉపాధ్యాయులను ఉద్దేశించి పిల్లలకు అందించు ఆహారం నాణ్యతతో కుడినదిగా వుండాలని,  బియ్యం, పప్పులు శుభ్రంగా కడగాలని పురుగు పట్టకుండా చూడాలని, వంటగది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలంలో పరిసరాలు మరింత శుభ్రంగా ఉంచుటకు ఎవరికి వారు తమవంతు ప్రయత్నించాలని తెలిపారు. ఉపాధ్యాయులను ఉద్దేశించి పిల్లలకు మంచి చదువు నేర్పాలని కోరారు.


ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీ పట్నల శ్రీనివాసు, డేవిడ్ రాజు, వెంకట చైతన్య, ఏసు పాదం, ఉమర్ ఫరూఖ్, పార లీగల్ వాలంటీర్ అక్బర్ ఆలి, స్కూల్ ఇంఛార్జి ప్రిన్సిపాల్ శ్రీదివ్య మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now