అలాగే డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న అనేక ఉత్పత్తులసు, చేనేత వస్త్రాలను విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నారన్నారు. మెప్మా అర్బన్ మార్కెట్ల ద్వారా డ్వాక్రా మహిళలు తయారుచేసిన అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వాటిని అమ్మకాలు చేయడం ద్వారా వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా అర్బన్ మార్కెట్లను ప్రతినెలా ఏర్పాటు చేయాలని ఆదేశించరని, అందులో భాగంగా ప్రతినెల ఒకరోజు డ్వాక్రా అర్బన్ మార్కెట్ను ఏర్పాటుచేసి డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించమన్నారు.
ప్రజలు డ్వాక్రా ఉత్పత్తులకు పూర్తిగా సహకరించాలని, ప్రస్తుత రోజుల్లో అంతా ఆన్లైన్ వ్యాపారం జరుగుతుండడంతో ఈ–కామర్స్ విధానం ద్వారా అమెజాన్, ఫ్లిప్కాట్ సంస్థల్లో కూడా మన డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులను నేరుగా కస్టమర్ అడ్రస్ ప్రోడక్ట్ను డెలివరీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని క్వాలిటీ ఉత్పత్తులను తయారు చేసి ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు ఉపయోగించుకోవాలని మేయరు షేక్ నూర్జహాన్ పెదబాబు కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయరు గుడిదేశి శ్రీనివాసరావు, ఎన్. సుధీర్బాబు కార్పొరేటర్లు జిజ్జువరపు విజయ నిర్మాలా, కో ఆప్షన్ సభ్యులు నీత విజయ్ కుమార్ జైన్, గంపల బ్రహ్మవతి, మెప్మా పీడీ ఇమాన్యు ల్ తదితరులు పాల్గొన్నారు.