యోగాపై నిర్వహించిన గ్రామ స్థాయిలో పోటీల్లో ఇంతవరకు 18,991 మంది పాల్గొన్నారు.
సోమవారం నుండి మండల స్థాయిలో పోటీలు
ఏలూరు: జిల్లాలో యోగా అభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం వరకు 6,59,725 మంది రిజిస్ట్రేషన్స్ పూర్తిచేసుకున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంలో 8.30 లక్షల మందిని భాగస్వాములను చేయాలనే లక్ష్యానికి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 6,59,725 మంది రిజిష్టర్ అయ్యారన్నారు. లక్ష్యానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్స్ వేగవంతం చేయాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు గ్రామ స్థాయిలో వివిధ స్ధాయిల్లో యోగాకు సంబంధించిన పలు అంశాలపై పోటీలను నిర్వహించగా , వాటిలో 18,991 మంది పాల్గొనగా వారిలో 15,150 మంది విజేతలుగా నిలిచారన్నారు. సోమవారం నుంచి మండల స్థాయిలో పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో గ్రామ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు మండల స్థాయిలో పాల్గొంటారన్నారు.