రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఆద్వర్యంలో మెగా జాబ్ మేళా..
ఈనెల 30వ తేదీ నూజివీడు ఎస్ఆర్ఆర్ జెడ్పి బాలుర హైస్కూల్ లో ఉదయం 9.30 గంటల నుంచి
13 ప్రముఖ సంస్ధల్లో 1095 ఉద్యోగుల నియామకాలు..
ANDRAPRADESH, ఏలూరు: రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఆద్వర్యంలో ఈనెల 30వ తేదీ నూజివీడులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి కార్యాలయం గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా ఈనెల 30వ తేదీ శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి నూజివీడు ఎస్ఆర్ఆర్ జెడ్పి బాలుర హైస్కూల్ లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు 13 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరై 1095 అర్హతగల ఎస్ఎస్ సి, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బిఫార్మసీ, బిటెక్, తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు.
కావున అర్హత గల అభ్యర్దులందరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్ధులు ముందుగా ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ లింకు https://naipunyam.ap.gov.in/user-registration లో నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్ధులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ లో రెస్యూమ్ తీసుకొని రాగలరు. పూర్తి వివరాలకు 9988853335, 8712655686, 8790118349 నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.