Hot Posts

6/recent/ticker-posts

ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి


 గృహ నిర్మాణశాఖ అధికారులతో టీసీ నిర్వహించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి 

హౌసింగ్ లేఅవుట్ నందు ఉన్న ఆప్షన్ 3 ఏజెన్సీల గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష 
రూఫ్ లెవెల్,రూఫ్ కాస్ట్ కు చేరుకున్న ఇళ్లను ఈ నెల 15 లోపు పూర్తి చేయాలి 

ఏలూరు: ఏలూరు జిల్లాలో జూన్ నెల 15 వ తేదీ వరకు ఆప్షన్ 3 ఏజెన్సీ వారిగా ఇండ్ల నిర్మాణ లక్ష్యాలను సంబంధిత అధికారులకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి నిర్దేశించారు. ఆదివారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయం నుంచి ఏలూరు జిల్లా హౌసింగ్ సిబ్బంది  హౌసింగ్ లేఅవుట్ నందు ఉన్న ఆప్షన్ 3 ఏజెన్సీల గృహ నిర్మాణ ప్రగతిపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా చేశారు. 

ఏలూరు నుంచి జిల్లా గృహ నిర్మాణ అధికారి, పలువురు హౌసింగ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ  జిల్లాలో ఆప్షన్ త్రీ కింద 18,849 ఇళ్లు నిర్మించవలసి ఉండగా,ఇప్పటి వరకు 3,225 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారన్నారు. రూఫ్ లెవెల్, రూఫ్ కాస్ట్ కు చేరుకున్న ఇళ్లను ఈ నెల 15 లోపు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

జూన్ నెల 15 వ తేదీ వరకు ఆప్షన్ 3 ఏజెన్సీ వారిగా ఇండ్ల నిర్మాణ లక్ష్యాలను నిర్దేశించారు. సదరు లక్ష్యాలను పూర్తి చేయుటకు గృహ నిర్మాణ సిబ్బంది సకాలంలో మెటీరియల్స్,బిల్లులు అందచేయవలసిందిగా మంత్రి  ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణ, ఈ స్థాయిలో హౌసింగ్ ఇంజనీర్లు,సిబ్బంది  పాల్గొన్నారు.