కానీ, వైసీపీని చూస్తే.. ఒక అజెండా అంటూ ఏమీ కనిపించడం లేదు. పార్టీ అధినేతకే ఒక అజెండా అంటూ క్లారిటీలేకపోవడంతో నాయకులు సైతం ఎలాంటి అజెండాలు లేకుండా మాట్లాడుతున్నారు.
ANDRAPRADESH: ఏ పార్టీ అయినా.. ఒక అజెండా పెట్టుకుని ప్రజల మధ్యకు వెళ్తుంది. ఒక అజెండా ప్రకారం.. పనిచేస్తుంది. కానీ, ఏడాది పూర్తయి నా.. వైసీపీకిఎలాంటి అజెండా కనిపించడం లేదు. వాస్తవానికి ఓటమి తర్వాత.. పార్టీలు పుంజుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఒక కీలకమైన అజెండాను పెట్టుకుని ముందుకుసాగాయి. గతంలో చంద్రబాబు ఒక అజెండా అందుకునేవారు. దీనిని పార్టీ నాయకులకు చెప్పేవారు. వారంతా దానిని హైలెట్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేసేవారు. నిరసనలు తెలిపేవారు. పలితంగా ప్రజలకు ఒక మెసేజ్ వెళ్లేది.
ఉదాహరణకు ఇసుక లభ్యతపై నాడు చంద్రబాబు విజయవాడలో నిరసన వ్యక్తం చేశారు. దీనిని అందిపుచ్చుకుని రాష్ట్ర వ్యాప్తం గా టీడీపీ నాయకులు అదే నిరసన కంటిన్యూ చేశారు. ఫలితంగా ఈ ఫోకస్ పార్టీకి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తర్వాత.. మద్యం ధరలపై ఉద్యమాన్ని అందుకున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించారు. అదేవిధంగా దళితులు, బీసీలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ మరో నిరసనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇలా.. ఒక అజెండా పెట్టుకుని దానిని సాకారం చేసుకున్నారు. పలితంగా ప్రజల్లోనూ కదలిక వచ్చింది.
కానీ,వైసీపీని చూస్తే.. ఒక అజెండా అంటూ ఏమీ కనిపించడం లేదు. పార్టీ అధినేతకే ఒక అజెండా అంటూ క్లారిటీలేకపోవడంతో నాయకులు సైతం ఎలాంటి అజెండాలు లేకుండా మాట్లాడుతున్నారు. ఒకరు మహానాడుపై మాట్లాడితే.. మరొకరు తమ జిల్లాల్లోని సమస్యలపై మీడియా ముందుకు వస్తున్నారు. మరికొందరు... స్థానికంగా ఉన్న సమస్యలపై గళం వినిపిస్తున్నారు. ఇక, ఇంకొందరు.. తమ వ్యక్తిగత వ్యవహారాలను కూడా లేవదీస్తున్నారు. ఇలా తలకో రకంగా వ్యవహరిస్తుండడం.. కీలకమైన అజెండా అంటూ ఏమీ లేకపోవడంతో వైసీపీ చేసే కార్యక్రమాలు ప్రజల మధ్యకు వెళ్లడం లేదన్నది వాస్తవం.
ఇక, వచ్చే నెల 4న `వెన్నుపోటు దినం` పేరుతో జగన్ నిరసనకు రెడీ అయ్యారు. అయితే.. దీని అజెండా కూడా నాయకులకు అర్ధం కావడం లేదట. దీనికి కారణం.. అసలు తాము ఏ విషయంపై ఉద్యమం చేయాలో తమకుక్లారిటీ లేదని అంటున్నారు. పైగా.. సూపర్ సిక్స్ ఇస్తామని చెబుతున్న సర్కారును కాదని.. ఇప్పుడు అనవసరంగా నిరసన వ్యక్తం చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అలా కాకుండా.. మరో రూపంలో పక్కా అజెండాను ఎంచుకుని ఉద్యమిస్తే.. అది మేలు జరుగుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, నిర్ణీత లక్ష్యం లేకుండా ఇలా నిరసన తెలిపినా.. ప్రజలు ఏమేరకు అర్ధం చేసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదీ.. సంగతి!!