Hot Posts

6/recent/ticker-posts

కాపు మ‌హిళ‌ల‌కు కూట‌మి 'గృహిణి' ..!


ANDRAPRADESH: ఇక‌, కాపు కార్పొరేష‌న్ ద్వారా కూడా.. వారికి మేలు చేసే ప‌నులు ప్రారంభించారు. అయినా.. అసంతృప్తి పూర్తిగా చ‌ల్లార‌లేదు. రాష్ట్రంలో కాపుల ఓటు బ్యాంకు రాజ‌కీయాల్లో కీల‌కం. రాజ‌కీయాల్లో నాయ‌కులు.. ఎక్క‌డ ఎలా ఉన్నా.. కాపులను మాత్ర త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు మాత్రం చేస్తారు. ఈ విష‌యంలో 2019లో జ‌గ‌న్ కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. అయితే.. త‌ర్వా త.. కాపుల‌కు ఇవ్వాల్సిన ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ స‌హా.. వారి డిమాండ్ల‌ను నెర‌వేర్చే విష‌యంలో జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యారు. ఫ‌లితంగా కాపులు జ‌గ‌న్‌కు దూర‌మ‌య్యారు. అయితే.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చిన ద‌రిమిలా.. వైసీపీలో .. కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. త‌ద్వారా కాపుల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.


ఇక‌, కాపు కార్పొరేష‌న్ ద్వారా కూడా.. వారికి మేలు చేసే ప‌నులు ప్రారంభించారు. అయినా.. అసంతృప్తి పూర్తిగా చ‌ల్లార‌లేదు. ప‌లితంగా కాపులు వ్య‌తిరేకుల‌య్యారు. మ‌ధ్య‌లో ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం వంటివారిని వైసీపీలో చేర్చుకున్నా.. ఆ ఎఫెక్ట్ పెద్ద‌గా ప‌నిచేయలేదు. మొత్తంగా చూస్తే.. ఆది నుంచికాపులను మ‌చ్చిక చేసుకునే విష‌యంలో చేసిన అల‌స‌త్వం.. వైసీపీకి బాగా ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది. క‌ట్ చేస్తే.. ఆ అనుభ‌వాలు.. వైసీపీ హ‌యాంలో కాపుల ఇక్క‌ట్ల‌ను గ‌మ‌నించిన కూట‌మి స‌ర్కారు ఇప్పుడు కాపుల కోసం ప్ర‌త్యేకంగా ప‌థ‌కాల‌ను వండివార్చుతోంది.

దీనిలో కీల‌క‌మైంది.. `గృహిణి`. కాపు సామాజిక వ‌ర్గంలో 40 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌ల‌కు ఈ గృహిణి ప‌థ‌కం కింద మేలు చేయ నున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాల‌ను కూడా ప్ర‌భుత్వం రెడీ చేస్తోంది. త‌ద్వారా.. కాపు వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌కు మేలు చేయ‌నున్నారు. ఒక్కొక్క‌రికీ ఈ ప‌థ‌కం కింద రూ.15000 ఇవ్వ‌నున్నారు. వీటిని ఏడాదికి ఒకసారి చొప్పున ఇవ్వ‌డం ద్వారాకాపు సామాజిక వ‌ర్గం మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డే దాకా ప్ర‌భుత్వం సాయం చేయ‌నుంది. ఇది నిరంత‌రాయం గా నిర్వ‌హించేందుకు కూడా ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు దీనిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వ‌ర్గం.. దీనికిఅనుబంధంగా ఉండే మ‌రికొన్ని సామాజిక వ‌ర్గాల‌కు కూడా ఈ గృహిణి ప‌థ‌కం కింద‌.. ఏటా రూ.15 వేల చొప్పున సాయం చేయ‌నున్న‌ట్టు ఆయ‌న ఇటీవ‌ల వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కాన్నిచంద్ర‌బాబు ప్ర‌క‌టించార‌ని.. అయితే.. విధివిధానాల రూప‌క‌ల్ప‌న కొంత ఆల‌స్య‌మైంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల‌కు రూ.15 వే ల‌చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పారు. ఇలా.. కాపు సామాజిక వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం ద్వారా ఇప్ప‌టి నుంచి వారి ఓటు బ్యాంకును.. పాజిటివిటీని కాపాడుకునేందుకు .. ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.