Hot Posts

6/recent/ticker-posts

చింతలపూడి కోర్టు ప్రాంగణము నందు పోష్ చట్టంపై అవగాహన సదస్సు...


ఏలూరు జిల్లా, చింతలపూడి: పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మంగళవారం చింతలపూడి కోర్టు ప్రాంగణము నందు పోష్  చట్టం పైన అవగాహన సదస్సు నిర్వహించారు.  పనిచేసే ప్రదేశాల్లో మహిళల పైన లైంగిక దాడులను నిరోధించే భాగంగా ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామని, 


ప్రతి సంస్థలలో మహిళల సమస్యలను పరిష్కరించడానికి కమిటీలను ఏర్పాటు చేసి ఆ వివరాలను  బహిరంగంగా పొందుపరచాలని జిల్లా న్యాయ కార్యదర్శి సూచించారు. అలాగే అసంఘటిత కార్మికులకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉంటాయని ఆయా జిల్లాలకు సంబంధించిన మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసుకోవచ్చని,  అలాగే ఫిర్యాదు దారిని వివరాలను గోప్యంగా ఉంచుతారని తెలియజేశారు.

చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుబాబు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బాలల పైన అత్యాచారాలు పెరిగిపోయాయని వీటిని నిరోధించడానికి సమాజంలో ప్రతి పౌరులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు బాలలపై ఎటువంటి అఘాయిత్యము జరిగిన వెంటనే దగ్గరలోని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు బాధితులకు వైద్య సదుపాయాల నిమిత్తం తక్షణ పరిహారాన్ని అందిస్తారని తెలియజేశారు.

అలాగే సాక్షుల వివరాలను గోప్యంగా ఉంచుతారని కావున ప్రజలు ఈ సమస్యను పరిష్కరించడానికి చట్టానికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్పిఓ పి మాధవి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సూపర్డెంట్ పి. జి.నాయుడు అడ్వకేట్ కేకేడి భవాని, పోలీసులు పాల్గొన్నారు.