Hot Posts

6/recent/ticker-posts

తిరుపతిలో దారుణం.. దళిత విద్యార్థి కిడ్నాప్.. ఆపై హత్యాయత్నం.. వైఎస్ జగన్ సీరియస్


తిరుపతిలో దారుణం జరిగింది. ఓ దళిత విద్యార్థిని కిడ్నాప్ చేశారు. చిత్ర హింసలకు గురిచేసి.. ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై మాజీసీఎం జగన్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని విమర్శించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ANDRAPRADESH, THIRUPATHI: తిరుపతి నగరంలో దారుణం వెలుగులోకి వచ్చింది. BY: PASCHIMA VAHINI దళిత విద్యార్థి జేమ్స్‌ను కిడ్నాప్ చేశారు. అతనిపై హత్యాయత్నాని పాల్పడ్డారు. రౌడీషీటర్ సాయి రూపేష్, చోటా బ్లేడ్ గ్యాంగ్ అతన్ని చంపేందుకు ప్రయత్నించారని.. జేమ్స్ ఆరోపించారు. బాధిత విద్యార్థి.. విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో విద్యార్థి జేమ్స్‌కు చికిత్స అందిస్తున్నారు. రౌడీషీటర్ అండ్ గ్యాంగ్‌పై తిరుచానూరు పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కేసు నమోదు చేయాలి..
'కులం పేరుతో దూషించి, నన్ను చంపేందుకు కుట్ర చేసిన వారిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. నన్ను ఒరేయ్ అంబేద్కర్ జాతి నా కొడకా అంటూ.. ప్రతి రోజు అవమానిస్తున్నారు. రౌడీషీటర్ మూత్రం నోట్లో పోసి ఒకటిన్నర రోజు చిత్ర హింసలు పెట్టారు. నాకు న్యాయం జరగాలి. లేదంటే ఆత్మహత్యనే శరణ్యం' అని బాధిత విద్యార్థి జేమ్స్ స్పష్టం చేశారు. 

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు.


దాడిని ఖండిస్తున్నాను..
'తిరుపతిలో ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు, అధికారపార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం.. పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి' అని జగన్ ట్వీట్ చేశారు.

పోలీసులపై నమ్మకం పోతోంది..
'ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్‌స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమేకాదు, ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను' అని జగన్ స్పష్టం చేశారు.