జిల్లాలోని 27 మండలాల వారీగా కొత్త బియ్యం కార్డుల వివరములు....
ఏలూరు 571,
నూజివీడు 251,
ద్వారకా తిరుమల 187,
కలిదిండి 183,
కైకలూరు 145,
లింగపాలెం 140,
నిడమర్రు 172,
ఉంగుటూరు 191,
చింతలపూడి 260,
చాట్రాయి 118,
అగిరిపల్లి 150,
పోలవరం 108,
జంగారెడ్డిగూడెం 292,
టి.నరసాపురం 148,
దెందులూరు 185,
భీమడోలు 152,
కామవరపుకోట 145,
బుట్టాయి గూడెం 103,
కొయ్యలగూడెం 167,
మండవల్లి 122,
పెదపాడు 174,
వైలెరుపాడు 24,
జిల్లుగుమిల్లి 41,
కుకునూరు 49,
ముదినేపల్లి 116,
ముసునూరు 118,
పెదవేగి 213,
మొత్తం 4531
పై తెలిపిన విధముగా ఏలూరు జిల్లాలో క్రొత్తగా 4531 కార్డులను మంజూరు చేయడం జరిగినది. ఈ క్రొత్తగా మంజూరు చేసిన కార్డుదారులందరికి ఈ నెల అనగా జనవరి నెల నుండే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయుటకు గాను జిల్లాలోని పౌర సరఫరాల అధికారులందరికి ఆదేశాలను జారీచేయడం జరిగినది.
కావున క్రొత్తగా కార్డులు మంజూరు అయిన 4531 కార్డుదారులందరూ, ప్రస్తుతం జిల్లాలో ఉన్న630215 కార్డులతో పాటు అందరూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న నాణ్యమైన పోర్టిఫైడ్ బియ్యం ఉచితముగా మరియు నిత్యావసర సరుకులను సబ్సిడిపై యండియు వాహనాల ద్వారా ఇంటి వద్దనే పొందవలసినదిగా తెలియజేయడమైనది.