ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధము మంగళవారం సందర్భముగా అధిక సంఖ్యలో భక్తులు, విచ్చేసి శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీస్వామివారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహన పూజలను నిర్వహించుకొన్నారు. తెల్లటి మద్ది చెట్టు నీడలో దైవానుగ్రహాన్ని వెదజల్లుతున్న పూజ్యదైవం శ్రీ మద్ది ఆంజనేయస్వామి. అయన బలవంతుడు, భక్తి మరియు రక్షణ యొక్క స్వరూపుడు.
![]() |
శ్రీ మద్ది ఆంజనేయస్వామి మంత్రముగ్ధమైన సన్నిధిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి రావడంతో ప్రశాంతమైన గ్రామం ఆధ్యాత్మిక స్వర్గధామంగా రూపాంతరం చెందింది. ప్రశాంతమైన తెల్లటి మద్ది చెట్టు క్రింద, భక్తులు ప్రార్థనలు చేయడానికి, కీర్తనలు పాడటానికి మరియు దైవిక మార్గదర్శకత్వం కోసం ఆలయం వద్దకు వస్తుంటారు. సందర్శించేవారి విశ్వాసం మరియు భక్తిని మెరుగుపరుస్తాయి.
శ్రీ మద్ది ఆంజనేయస్వామి అపరిమితమైన శక్తి మరియు తన భక్తులకు బలం, జ్ఞానం మరియు రక్షణను ప్రసాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని భక్తులు నమ్ముతారు. అయన దివ్య ప్రకాశం వాతావరణాన్ని సానుకూలతతో నింపుతుంది, అయన ఆశీర్వాదం కోసం వచ్చిన వారందరి హృదయాలలో ఆశ మరియు ఓదార్పును నిండుతుంది. గురవాయిగూడెం గ్రామంలోని తెల్లటి మద్ది చెట్టు శ్రీ మద్ది ఆంజనేయస్వామి యొక్క దైవిక సన్నిధికి ప్రతీకగా నిలిచి, ఆయన భక్తుల నిరంతర విశ్వాసానికి మరియు భక్తికి నిదర్శనంగా నిలుస్తోంది
ఈరోజు మద్యాహ్నం గం.1.00 ల. వరకు శ్రీసామివారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ రూ.1,33,221/- లు సమకూరినది. సుమారు 1000 మంది భక్తులకు స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. శ్రీ స్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.