Hot Posts

6/recent/ticker-posts

రేణుక నోటి చేటు...తెలంగాణాలో పోటు


TELANGANA, KHAMMAM: ఏడు పదుల వయసులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఎంపీ రేణుకా చౌదరిలో అదే దూకుడు ఇంకా కనిపిస్తోంది. ఆమె ఒకపుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్. ఆమెని దివంగత నేత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి గద్దె దించారని తెలుగు లోకమంతా ఎగిసిపడింది. నాడు నిండు గర్భిణిగా ఉన్న రేణుకా చౌదరి తన ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించారు. 


ఆలా ఆమె అన్న గారి కంట్లో పడ్డారు ఆ తరువాత 1986లో రాజ్యసభకు ఎంపిక అయ్యారు. అలా రెండు సార్లు టీడీపీ నుంచి 12 ఏళ్ళ పాటు పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆమె గత పాతికేళ్ళుగా కాంగ్రెస్ లోనే పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రిగా అనేక కీలక పదవులు అందుకున్న ఆమె కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్. పైగా డేరింగ్ అండ్ డేషింగ్ లీడర్. 

అయితే ఆమె తన సీనియారిటీతో కాంగ్రెస్ కి మేలు చేస్తున్నారా అంటే ఆమె నోటితో చేటు తెస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఏపీ రాజకీయాల్లో తలదూరుస్తూ మాట్లాడితే చాలు జగన్ మీద ఒంటి కాలి మీద లేస్తున్నారు ఆఖరుకు ఆమె ఎంతటి అనుచితమైన వ్యాఖ్యలకైనా వెనుకాడడం లేదు. తాజాగా అమరావతి రాజధాని మీద సాక్షి మీడియాలో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యల మీద రేగిన దుమారం అంతా ఇంతా కాదు. దాని మీద ఒక టీవీ చానల్ డిబేట్ లో రేణుకా చౌదరి జగన్ ని చాలా దారుణంగా విమర్శించారు. 

అంతే కాదు పుట్టడంతోనే పీక పిసికి ఉండాల్సింది పీడా పోయేది అన్నారు నిజంగా ఇవి ఒక సీనియర్ రాజకీయ నాయకురాలిగా ఒక మహిళగా ఆమె చేయడం ఎంతవరకూ సమంజసం అన్న మాట వినిపిస్తోంది. 
 
ఆమె కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆమె ఏపీలో టీడీపీకి లాభం చేకూర్చాలని తాపత్రయంతో చేస్తున్నారా లేక ఏపీ మీద మమకారంతో చేస్తున్నారా అన్నది పక్కన పెడితే చివరికి అవి వైసీపీకే రాజకీయంగా సానుభూతిని తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకించి జగన్ కే ఆ సింపతీ వస్తుందని అంటున్నారు. ఇక తెలంగాణాలో చూసుకుంటే రాజకీయాన్ని మార్చే స్థితిలో రెడ్లు ఉన్నారు. వారి కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఏపీలో జగన్ ని విమర్శిస్తూ పోతే వారు తెలంగాణాలో కాంగ్రెస్ కి దూరం అయ్యేలా సీన్ క్రియేట్ అవుతుందని రేణుకా చౌదరి ఎందుకు ఆలోచించడం లేదు అని అంటున్నారు. 

ఆమె జగన్ ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న వ్యాఖ్యలు బూమరాంగ్ అవుతున్నాయని ఆమె ఆగ్రహంతో ఏవేవో మాట్లాడేస్తున్నారు అని అవి కాస్తా కాంగ్రెస్ కే చుట్టుకునేలా ఉన్నయని అంటున్నారు. రేణుకా చౌదరిని కాంగ్రెస్ పెద్దలు ఎంతో కొంత నియంత్రించాల్సి ఉందని అంటున్నారు. ఏపీ రెండుగా విడిపోయిన వేళ తెలంగాణా నాయకులు ఎవరూ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని గుర్తు చేస్తున్నారు. మరి రేణుకా చౌదరికి ప్రత్యేక ఆసక్తి ఎందుకు అని అంటున్నారు. ఒకనాడు టీడీపీలో చంద్రబాబు కోటరీలో ఉన్న రేణుక ఆయనతో విభేదించి కాంగ్రెస్ లోకి వెళ్లారు. మళ్లీ ఇపుడు బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇది కాంగ్రెస్ కే నష్టం అని అంటున్నారు.